జూలై కరెంట్ అఫైర్స్ 2020
జూలై 2020 అంతర్జాతీయం
మయన్మార్లో జేడ్ గనిలో ఘోర ప్రమాదం
మయన్మార్లోని కచిన్ రాష్ట్రం హపకంట్ సమీపంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి (జేడ్) గనిలో జూలై 2న ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. జేడ్ గని నుంచి భారీ యంత్రాలతో తవ్వి తీసిన మట్టిని ఆ పక్కనే పోస్తుంటారు. కార్మికులు అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల నివాసాలపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. 2015లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. అక్రమంగా జరిగే జేడ్ గనుల తవ్వకాలతో మాజీ సైనిక పాలకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
కువైటీలు |
30.36 శాతం |
ఇతర అరబ్ దేశాల వారు |
27.29 శాతం |
ఆసియావాసులు |
40.42 శాతం |
ఆఫ్రికావాసులు |
1.02 శాతం |
యూరప్వాసులు |
0.39 శాతం |
ఇతరులు |
0.52 శాతం |
పాకిస్తాన్కు చైనా సాయుధ డ్రోన్లు
పాకిస్తాన్కు చైనా నాలుగు సాయుధ డ్రోన్లను సరఫరా చేయనుంది. చైనా-పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్, గ్వాదర్ నౌకాశ్రయం వద్ద ఉన్న చైనా నేవీ బేస్ల రక్షణ కోసమే వాటిని పాకిస్తాన్ అందజేస్తున్నామని చైనా వెల్లడించింది. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)కు బలూచిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్ అత్యంత కీలకం. మొదట రెండు డ్రోన్ వ్యవస్థలను(ఒక్కో వ్యవస్థలో రెండు డ్రోన్లు, ఒక గ్రౌండ్ స్టేషన్ ఉంటాయి) పాక్కు చైనా అందించనుందని, ఆ తరువాత రెండు దేశాలు కలిసి 48 జీజే- 2 డ్రోన్లను తయారు చేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా ఇప్పటికే నిఘా విధులతో పాటు దాడులు చేయగల వింగ్ లూంగ్ 2 డ్రోన్లను ఆసియాలోని పలు దేశాలకు విక్రయిస్తోంది.
గ్లోబల్ వీక్-2020
భారత్లో వాణిజ్యం, విదేశీ పెట్టుబడులకు అవకాశాలే ప్రధానాంశంగా జూలై 9వ తేదీ నుంచి జరిగే ప్రపంచ వేదిక ఇండియా గ్లోబల్ వీక్-2020లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. కోవిడ్-19 అనంతర ప్రపంచంలో భారత్లో పెట్టుబడులకు, ఉత్పత్తి రంగంలో గల అపార అవకాశాలను ఆయన వివరించనున్నారని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇండియా ఇన్కై ్లన్ గ్రూప్ చైర్మన్, సీఈవో మనోజ్ లాడ్వా వెల్లడించారు. లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ మీడియా సంస్థ మూడు రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహించనుంది.
జూలై 2020 జాతీయం
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ దళాల సామర్థ్యాన్ని పెంచడంలో భాగంగా రూ.38,900 కోట్లతో 33 యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, ఇతర ఆయుధాల కొనుగోలుకు భారత రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జూలై 2న జరిగిన రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
డీఏసీ నిర్ణయాల ప్రకారం...
మిగ్-29 ప్రత్యేకతలు..
సుఖోయ్ విశేషాలు..
మధ్యప్రదేశ్లో కేబినెట్ విస్తరణ
శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టింది. తాజాగా 28 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మంత్రుల సంఖ్య 34కు చేరుకుంది. రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ రాజ్భవన్లో జూలై 2న వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 20 మంది కేబినెట్ స్థాయి మంత్రులు కాగా, 8 మంది సహాయక మంత్రులు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం చౌహాన్, కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ హాజరయ్యారు. 2020, మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 22 మంది జ్యోతిరాదిత్య అనుచర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే.
పీవీ పోస్టల్ స్టాంప్ విడుదలకు ఆమోదం
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని పీవీ స్మారకంగా పోస్టల్ స్టాంప్ విడుదల చేసేందకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి వెల్లడించారు. త్వరలోనే పోస్టల్ శాఖ ద్వారా ఈ స్టాంప్ విడుదల కానుందని ఆయన పేర్కొన్నారు. పీవీ స్మారకార్థం ప్రత్యేక తపాలా బిళ్లవిడుదల చేస్తుండటంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పీవీ జయంత్యుత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు హర్షం వ్యక్తంచేశారు.
పీవీ మ్యూజియం ప్రారంభం
మాజీ ప్రధాని, స్వర్గీయ పీవీ నరసింహారావు మ్యూజియాన్ని వర్చువల్ విధానంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జూన్ 28న ప్రారంభించారు. సురభి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మాదాపూర్లోని శ్రీ వేంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కళాశాలల ప్రాంగణంలో ఈ మ్యూజియం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో సురభి విద్యాసంస్థల చీఫ్, పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి, పీవీ ప్రభాకర్రావు పాల్గొన్నారు.
పురాతన కట్టడాల సందర్శనకు అనుమతి
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తాజ్మహల్, ఎర్రకోట, కుతుబ్ మినార్, సూర్య దేవాలయం వంటి పురాతన, చారిత్రక కట్టడాలను పర్యాటకులు, భక్తులు జూలై 6వ తేదీ నుంచి సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పురావస్తు పరిశోధన శాఖ(ఏఎస్ఐ) ఆధ్వర్యంలోని 3,691 కట్టడాలు, ప్రదేశాల్లో 2020, మార్చి 17 నుంచి సందర్శకులకు అనుమతి నిలిపివేసిన సంగతి తెలిసిందే. అన్లాక్-1లో భాగంగా వీటిలో 820 మతపరమైన ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను పునఃప్రారంభించారు. అన్లాక్-2 అమల్లోకి రావడంతో మిగిలిన వాటిని జూలై 6 నుంచి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది.
గ్లో అండ్ లవ్లీగా ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మార్పు
ప్రముఖ సౌందర్య ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ పేరును గ్లో అండ్ లవ్లీగా మార్చినట్టు హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) జూలై 2న ప్రకటించింది. పురుషులకు సంబంధించిన సౌందర్య సాధనాలను గ్లో అండ్ హ్యాండ్సమ్గా పిలవనున్నట్టు తెలిపింది. అందానికి సంబంధించి సంపూర్ణ అర్థాన్నిచ్చే దృష్టితో ఫెయిర్ అండ్ లవ్లీ నుంచి ఫెయిర్ పదాన్ని తొలగిస్తున్నట్టు హెచ్యూఎల్ 2020, జూన్ 25న ప్రకటించింది. చర్మాన్ని తెల్లగా మార్చే సౌందర్య ఉత్పత్తులు వర్ణవివక్షలో భాగమేనన్న చర్చ నేపథ్యంలో హెచ్యూఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.
అమెరికాకు చెందిన ఎఫ్ఎంసీజీ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ చర్మాన్ని తెల్లగా మార్చే ఉత్పత్తుల విక్రయాలను ఇప్పటికే నిలిపివేయగా, ఫ్రెంచ్ కంపెనీ ఎల్ఓరియల్ గ్రూపు కూడా తమ ఉత్పత్తుల నుంచి వైట్, వెటైనింగ్ పదాలను తొలగించనున్నట్టు గత వారం ప్రకటించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ ఆరో వార్షిక సర్వే ప్రారంభం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 ఆరో వార్షిక సర్వే కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ జూలై 3న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ద్వారా ఏటా పరిశుభ్రంగా ఉండే నగరాలకు ర్యాంకులు ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది రాష్ట్రాలకూ ర్యాంకులు ఇవ్వనున్నట్టు మంత్రి హర్దీప్ ప్రకటించారు. మురికి నీటి నిర్వహణ, నగరాల పరిశుభ్రత కోసం కేటాయించిన నిధులు, వాటి వినియోగం, స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహకారం వంటి అంశాల ఆధారంగా ర్యాంకులను ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఆరు ప్రమాణాల ఆధారంగా...
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను ఆరు ప్రమాణాలకనుగుణంగా నిర్ణయిస్తారు. తడిచెత్త, పొడి చెత్తను వేరు చేయడం, తడి వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం, తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్, రీ సైక్లింగ్, నిర్మాణ రంగంలో వ్యర్థాల ప్రాసెసింగ్, పూడ్చి పెట్టే వ్యర్థాల శాతం, పారిశుద్ధ కార్యక్రమాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటిస్తారు.
కొత్తగా ప్రేరక్ దార్ అవార్డు...
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ద్వారా 2020 ఏడాది కొత్తగా ప్రేరక్ దార్ సమ్మాన్ అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డుల్లో అయిదు సబ్ కేటగిరీలు ఉంటాయి. అవి దివ్య (ప్లాటినమ్), అనుపమ్ (గోల్డ్), ఉజ్వల్ (సిల్వర్), ఉదిత్ (బ్రాంజ్), అరోచి (యాస్పరింగ్) అవార్డులను ఇస్తారు. ప్రతీ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనిపించే మూడు నగరాలను ఎంపిక చేస్తారు.
లద్దాఖ్లో ప్రధాని మోదీ ఆకస్మిక పర్యటన
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో చైనాతో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్లో జూలై 3న ఆకస్మిక పర్యటన జరిపారు. ఈ సందర్భంగా నిములో ఉన్న ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్ వద్ద భారతీయ సైనిక, వైమానిక, ఐటీబీపీ దళాలనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణల్లో అసువులు బాసిన అమర జవాన్లకు మరోసారి నివాళులర్పించారు. అలాగే గల్వాన్ ఘర్షణల్లో గాయపడి, ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. ఆకస్మిక పర్యటనలో ప్రధానితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె పాల్గొన్నారు.
ఉన్నతాధికారులతో సమీక్ష...
నిము 11 వేల అడుగుల ఎత్తున సింధు నది ఒడ్డున ఉన్న కఠిన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న ఆర్మీ ఫార్వర్డ్ పోస్ట్. దీని చుట్టూ జన్స్కర్ పర్వతాలున్నాయి. అక్కడ భారత జవాన్లతో ప్రధాని కాసేపు ముచ్చటించారు. వాస్తవాధీన రేఖ స్థితిగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
మోదీ ప్రసంగం-ముఖ్యాంశాలు
ఉద్రిక్తతలు పెంచే పనులొద్దు: చైనా
లద్దాఖ్లో మోదీ ఆకస్మిక పర్యటనపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియన్ స్పందిస్తూ... రెండు దేశాల మధ్య మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఈ సమయంలో ఉద్రిక్తతలు పెరిగే చర్యలకు రెండు దేశాలు ఉపక్రమించడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. భారత్లోని వ్యాపారాలకు సంబంధించి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చైనాను విస్తరణ వాద దేశంగా భావించడం అర్థరహితమని భారత్లో చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి జీ రాంగ్ ట్వీట్ చేశారు.
ఆత్మనిర్భర్ యాప్ చాలెంజ్ ప్రారంభం
ప్రపంచస్థాయి మేడ్ ఇన్ ఇండియా యాప్స్ను తయారు చేయడంలో దేశంలోని ఐటీ, స్టార్టప్ రంగాల వారికి సరైన వేదిక కల్పించేందుకు ఉద్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ యాప్ ఇన్నోవేషన్ చాలెంజ్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ జూలై 4న ఈ చాలెంజ్ను ప్రారంభించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ఈ చాలెంజ్ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ... యాప్ చాలెంజ్లో పాల్గొనాలని స్టార్టప్లు, ఐటీ సంస్థలకు పిలుపునిచ్చారు.
ప్రధాని ప్రసంగం-ముఖ్యాంశాలు
ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ ఆస్పత్రి ప్రారంభం
ప్రపంచంలోనే అతి పెద్దదైన కోవిడ్ కేర్ సెంటర్ సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. ఢిల్లీలోని చతార్పూర్ వద్ద 10 వేల పడకలతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ జూలై 5న ప్రారంభించారు. ఈ సెంటర్ను ఆపరేషన్ కరోనా వారియర్స్ పేరిట ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) నిర్వహిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం పరిపాలనాపరమైన సహకారం అందిస్తోంది. లక్షణాలు కనిపించని, లక్షణాలు కనిపించే.. ఇలా రెండు రకాల కరోనా బాధితులకు ఇక్కడ వేర్వేరుగా సేవలందిస్తారు.
20 ఫుట్బాల్ మైదానాలంత..
1,700 అడుగుల పొడవు, 700 అడగుల వెడల్పు ఉన్న ఈ కేర్ సెంటర్లో 200 ఎన్క్లోజర్లు ఉన్నాయి. ఒక్కో ఎన్క్లోజర్లో 50 చొప్పున పడకలు ఏర్పాటు చేశారు. మొత్తం సెంటర్లో 20 ఫుట్బాల్ ఆట స్థలాలను ఇమడ్చవచ్చు. మరో 200 పడకలను ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన స్థలం ఇంకా మిగిలి ఉంది. మరోవైపు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో డీఆర్డీఓ నిర్మించిన 1,000 పడకల సర్దార్ పటేల్ కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా సందర్శించారు.
ఫేస్బుక్తో సీబీఎస్ఈ భాగస్వామ్యం
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్తో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) జత కట్టింది. విద్యార్థులకు, అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ, ఆన్లైన్ వెల్బీయింగ్, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ నిశాంక్ పోఖ్రియాల్ జూలై 5న వెల్లడించారు. కనీసం 10 వేల మంది ఇందులో భాగస్వాములవుతారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఎలిమెంట్స్ యాప్ ఆవిష్కరణ
స్వదేశీ సామాజిక మాధ్యమ వేదిక ఎలిమెంట్స్ యాప్ను ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు జూలై 5న ఆవిష్కరించారు. ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సభాప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతూ... మనం ఇతరులను అనుకరించడాన్ని పక్కనపెట్టి కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలన్నారు.
దేశవ్యాప్తంగా కోటి కరోనా టెస్టులు
దేశంలో ఇప్పటి వరకు 1,00,04,101 కరోనా టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) శాస్త్రవేత్త, మీడియా సమన్వయకర్త డాక్టర్ లోకేశ్ శర్మ జూలై 6న తెలిపారు. ప్రస్తుతం 1,105 ల్యాబ్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ప్రభుత్వ ల్యాబ్లు 788, ప్రైవేట్ ల్యాబ్లు 317 ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా టెస్టుల సామర్థ్యం మే 25న 1.5 లక్షలు ఉండగా, ఇప్పుడు 3 లక్షలకు చేరిందని తెలియజేశారు.
ప్రపచంలో మూడో స్థానానికి...
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో భారత్ రష్యాను దాటేసి ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు 7 లక్షలకు, మరణాలు 20 వేలకు చేరువవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జూలై 6న ప్రకటించింది. రికవరీ రేటు 60.85 శాతంగా నమోదయి్యంది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. కరోనా మరణాల విషయంలో ఇండియా ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.
ప్రపంచంలోనే తొలిసారిగా రైళ్లకు సౌర విద్యుత్
భారతీయ రైల్వే శాఖ మరో అరుదైన ఘనత సాధించింది. మధ్యప్రదేశ్లోని బినా పట్టణంలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను రైల్వే ఓవర్హెడ్ లైన్కు మళ్లించింది. అంటే ఈ కరెంటుతో రైళ్లు నడుస్తాయి. రైళ్లు నడపడానికి సౌర విద్యుత్ను ఉపయోగించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్కుమార్ యాదవ్ తెలిపారు.
బీహెచ్ఈఎల్ భాగస్వామ్యంతో..
రైల్వేశాఖ, బీహెచ్ఈఎల్ సంయుక్త భాగస్వామ్యంతో బినా పట్టణంలోని రైల్వేశాఖ స్థలంలో 1.7 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి గోయెల్ చెప్పారు. ఇక్కడ ప్రతిఏటా 25 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుందన్నారు. తద్వారా రైల్వేశాఖకు ఏటా రూ.1.37 కోట్ల మేర ఆదా అవుతుందన్నారు.
మహిళా సైనికాధికారుల కమిషన్ గడువు పెంపు
మహిళా సైనికాధికారులకు ప్రత్యేకంగా పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు మరో నెల రోజుల గడువునిచ్చింది. గత తీర్పులో ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాల ధర్మాసనం ఆదేశించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఈ తీర్పు అమలుకు 6 నెలల సమయం కావాలని కేంద్రం కోరిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జూలై 7న ఈ ఆదేశాలు జారీచేసింది. లింగ వివక్షను నిర్మూలించేందుకు మహిళాసైనికాధికారులకు పర్మనెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఉన్నత న్యాయస్థానం 2020, ఫిబ్రవరి 17న చరిత్రాత్మక తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల లోపు పర్మనెంట్ కమిషన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది.
ఏఆర్హెచ్సీ అభివృద్ధి ప్రతిపాదనకు ఆమోదం
పట్టణాల్లోని వలస కూలీలు, పేదల కోసం చవకగా అద్దె గృహ సముదాయాలను(అఫర్డబుల్ రెంటల్ హౌజింగ్ కాంప్లెక్సెస్- ఏఆర్హెచ్సీ) అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 8న జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికులకు.. తాము పని చేసే ప్రదేశాలకు దగ్గరలో చవకగా అద్దె ఇళ్లు అందించే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించనున్నారు.
ఏఆర్హెచ్సీ-వివరాలు
జూలై 2020 రాష్ట్రీయం
ఏపీ ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా రమేష్కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్కుమార్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు(ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) వరకు పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జూలై 2న ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రమేష్కుమార్ పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత పశ్చిమబెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యునిగా కూడా సేవలందించారు.
కమిషనర్గా శ్రీనివాసరావు
రాష్ట్ర సమాచార కమిషనర్గా రేపాల శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లుగానీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు గానీ (ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) పదవిలో కొనసాగుతారు.
హైదరాబాద్లో ఎన్పీసీఐ డేటా సెంటర్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) హైదరాబాద్ నగరంలో స్మార్ట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. రూ.500 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఎన్పీసీఐ నిర్మించనున్న స్మార్ట్ డేటా సెంటర్కు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు జూలై 2న శంకుస్థాపన చేశారు. పేమెంట్ యాప్స్, కార్డులు ఇతరత్రా నగదురహిత లావాదేవీలను నిర్వహించడం, వివాదాల పరిష్కారానికి ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఎన్పీసీఐను 2008లో ఏర్పాటు చేశాయి.
భూకంపం వచ్చినా...
అంతర్జాతీయ స్థాయి డేటా సెక్యూరిటీ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎన్పీసీఐ ఈ డేటా సెంటర్ను ఎన్పీసీఐ నిర్మిస్తోంది. భూకంపం, తుపాన్ల వంటి ప్రకతి వైపరీత్యాలు సంభవించినా చెక్కు చెదరకుండా ఉండేలా అత్యంత పటిష్టంగా ఈ సెంటర్ను నిర్మించనున్నారు. ఎల్అండ్టీ సంస్థకు ఈ డేటా సెంటర్ నిర్మాణ పనులను అప్పగించారు.
డిజిటల్ చెల్లింపుల కేంద్రంగా హైదరాబాద్...
ఎన్పీసీఐ డేటా సెంటర్ నిర్మాణం పూర్తయితే దేశంలో అతిపెద్ద డిజిటల్/ ఆన్లైన్ చెల్లింపుల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ ఆవిర్భస్తుంది. భౌగోళికంగా, మానవవనరుల పరంగా, శాస్త్ర సాంకేతిక సదుపాయాల పరంగా నగరానికి ఉన్న అనుకూలతలు ఎన్పీసీఐ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడానికి దోహదపడ్డాయి.
కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ ప్రారంభం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం కలిగించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్) ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 3న సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్ను ప్రారంభించారు. ఒకేసారి 50 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించేందుకు కంప్యూటర్లో బటన్ నొక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచనుగా ఏ కోత లేకుండా గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావడంతో పాటు, లంచాల ప్రసక్తి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు.
ఆప్కాస్ ఏర్పాటు లక్ష్యం...
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గరిష్టంగా ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వేతనాలు పూర్తిగా చెల్లించడం, ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేయడం. ఆయా ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వాటన్నింటిలో మహిళలకు 50 శాతం ఇవ్వడం ఆప్కాస్ లక్ష్యం. ఆప్కాస్ చైర్మన్గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు.
ఏపీలో సున్నా వడ్డీ రాయితీ సొమ్ము విడుదల
సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు ఇక నుంచి నేరుగా సున్నా వడ్డీ ప్రయోజనాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఖరీఫ్కు సంబంధించిన రుణాలను సకాలంలో చెల్లిస్తే అక్టోబర్లో.. రబీకి చెందిన రుణాలను సకాలంలో చెల్లిస్తే మార్చిలో సున్నా వడ్డీ రాయితీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని రైతు దినోత్సవం సందర్భంగా జూలై 8న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,150 కోట్లను 57 లక్షల మంది రైతుల ఖాతాలకు కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల్లోని రైతులనుద్ధేశించి ప్రసంగించారు.
సీఎం ప్రసంగం-ముఖ్యాంశాలు
ఆవిష్కరణలు...
నాలో.. నాతో.. వైఎస్సార్ పుస్తకావిష్కరణ
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా జూలై 8న ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్ విజయమ్మ రాసిన నాలో.. నాతో.. వైఎస్సార్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన
రాష్ట్ర ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేలా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల నిలువెత్తు విగ్రహ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చారిత్రక ఘట్టానికి విజయవాడలోని స్వరాజ్ మైదాన్ వేదిక కానుంది. విగ్రహ ఏర్పాటుతో పాటు పార్కు తదితర నిర్మాణ పనులకు జూలై 8న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే చూడదగ్గ ప్రదేశంగా అంబేడ్కర్ మెమోరియల్ పార్క్ను తీర్చిదిద్దుతామన్నారు.
అంబేడ్కర్ స్వరాజ్ మైదాన్గా నామకరణం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 5.2 శాతం క్షీణత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020లో మైనస్ 5.2 శాతం క్షీణిస్తుందని ఆర్థిక విశ్లేషణా దిగ్గజ సంస్థ- డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్(డీఅండ్బీ) అంచనా వేసింది. కరోనా వైరస్ ఇప్పటికీ విస్తరిస్తుండడం, పలు దేశాల ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు కొనసాగే అవకాశాలే కనిపిస్తుండడం తన అంచనాలకు కారణంగా తెలిపింది. ఈ మేరకు గ్లోబల్ అవుట్లుక్ నివేదికను డీఅండ్బీ విడుదల చేసింది. 132 దేశాలపై అధ్యయనం చేసిన అవుట్లుక్ 2022కు ముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమించే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడింది. డీఅండ్బీ విశ్లేషణే నిజమైతే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఇంతటి తీవ్ర క్షీణత చూడ్డం ఇదే తొలిసారి అవుతుంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009లో 1.7 శాతం క్షీణత నమోదయి్యంది.
క్షీణతలోనే భారత్..: నాలుగు దశాబ్దాల అనంతరం భారత్ ఆర్థిక వ్యవస్థ 2020లో క్షీణతలోకి జారనుందని డీఅండ్బీ చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు. 2020, మార్చిలోనే భారత్ రేటింగ్ను డీఅండ్బీ డీబీ4డీ నుంచి అధిక రిస్క్తో కూడిన డీబీ5సీలోకి మార్చిన విషయాన్ని ప్రస్తావించారు.
ఆగస్టు వరకు ఈపీఎఫ్ చెల్లింపుల పథకం
చిన్న సంస్థల తరఫున ఈపీఎఫ్ చెల్లింపుల పథకాన్ని 2020, ఆగస్టు వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ జూలై 8న నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా చిన్న, మధ్య స్థాయి సంస్థలు చాలా వరకు మూతపడడంతో.. వాటికి వెసులుబాటునిస్తూ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం కింద ఈపీఎఫ్ భారాన్ని తాను భరించనున్నట్టు కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ పథకం ప్రకారం... 100 వరకు ఉద్యోగులు కలిగిన సంస్థల్లో 90 శాతం మంది రూ.15,000లోపు వేతనం కలిగి ఉంటే.. ఉద్యోగుల చందాతోపాటు, వారి తరఫున ఆయా సంస్థల చందా (చెరో 12 శాతం)ను కేంద్రమే చెల్లించనుంది.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు
జూలై 2020 ద్వైపాక్షిక సంబంధాలు
రష్యా అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు
కరోనా సంక్షోభం, వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం.. తదితర అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూలై 2న ఫోన్లో చర్చించారు. కోవిడ్-19 అనంతరం ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని, 2020 ఏడాది చివర్లో జరిగే వార్షిక ద్వైపాక్షిక సదస్సును విజయవంతం చేసే దిశగా సంప్రదింపులను మరింత విసృ్తతం చేయాలని తీర్మానించారు. భారత్లో జరిగే ఈ సదస్సులో పాల్గొనాలని పుతిన్ను మోదీ ఆహ్వానించారు. భారత్తో అన్ని రంగాల్లో ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందన్న పుతిన్.. ఆ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
చైనా విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోం
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా నుంచి భారత్ విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకోబోదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. అలాగే, చైనా, పాకిస్తాన్ల నుంచి వచ్చే పరికరాల దిగుమతులను కేవలం తనిఖీల ఆధారంగా అనుమతించేది లేదని పేర్కొన్నారు. తనిఖీల తర్వాతైనా అవసరమైతే అనుమతులు రద్దు చేస్తామన్నారు. రాష్ట్రాల విద్యుత్ శాఖల మంత్రులతో జూలై 3న జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు.
సమావేశంలో మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడుతూ... భారత్ రూ. 71,000 కోట్ల విలువ చేసే విద్యుత్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో రూ.21,000 కోట్ల మేర చైనా నుంచి దిగుమతయ్యాయి. చైనా, పాకిస్తాన్ల నుంచి ఏదీ కొనుగోలు జరిపే ప్రసక్తే లేదు. దిగుమతి చేసుకున్న వాటిల్లో (చైనా నుంచి) ఏ మాల్వేర్ ఉందో ట్రోజన్ హార్స్ ఉందో (వైరస్లు). వీటి సాయంతో వారు అక్కడెక్కణ్నుంచో మన విద్యుత్ వ్యవస్థలను చిన్నాభిన్నం చేయొచ్చు అని మంత్రి వ్యాఖ్యానించారు.
చైనా దిగుమతులకు ముందస్తు అనుమతి తప్పనిసరి
చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నుంచి విద్యుత్ పరికరాల దిగుమతులకు ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. భారత్తో సరిహద్దులున్న దేశాలు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులను తగ్గించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యుత్ సరఫరా వ్యవస్థలో వినియోగించేందుకు దిగుమతి చేసుకున్న అన్ని రకాల యంత్రాలు, పరికరాలు, విడిభాగాలతో మాల్వేర్, ట్రోజన్లు, సైబర్ ముప్పులాంటివి పొంచి ఉన్నాయేమో తెలుసుకునేందుకు, భారత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేవా అని చూసేందుకు దేశీయంగా పరీక్షించడం జరుగుతుంది. విద్యుత్ శాఖ నిర్దేశించిన అధీకృత ల్యాబొరేటరీల్లో టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది.
బలగాల ఉపసంహరణకు మరికొన్ని రోజులు
గల్వాన్ లోయలోని భారత్, చైనా సైన్యాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాల ఉపసంహరణ ముగిసేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ఆర్మీ వర్గాలు జూలై 7న వెల్లడించాయి. పెట్రోలింగ్ పాయింట్ 15 హాట్స్ప్రింగ్స వద్ద ఉపసంహరణ ప్రక్రియ జూలై 7నే పూర్తి కావచ్చని, గొగ్రా ప్రాంతంలో మాత్రం మరి కొన్ని రోజులు పట్టవచ్చని తెలిపాయి.
సాధ్యమైనంత త్వరగా...
ఇరుదేశాల ఆర్మీ కమాండర్ స్థాయి అధికారుల మధ్య మూడు విడతలుగా జరిగిన చర్చలు, ఆ తరువాత భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల మధ్య జూలై 5న జరిగిన చర్చల నేపథ్యంలో.. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను సాధ్యమైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా, బలగాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఉపసంహరణ కార్యక్రమం జూలై 6న ప్రారంభమైంది.
పీపీ 14 నుంచి...
ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. రెండు దేశాల సైన్యాలు ఘర్షణాత్మక ప్రదేశాల నుంచి 1 నుంచి 1.5 కిలోమీటర్ల వరకు వెనక్కు వెళ్లాలి. అలాగే, భవిష్యత్ కార్యాచరణ కోసం చర్చలు కొనసాగించాలి అని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్ లోయలోని పీపీ 14 నుంచి చైనా బలగాలు వెనక్కు వెళ్లాయని, టెంట్స్ను తొలగించాయని తెలిపాయి.
రివ్యూ పిటిషన్కు జాదవ్ అంగీకరించలేదు: పాక్
గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్ జైల్లో ఉన్న మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ తనకు విధించిన మరణశిక్షపై రివ్యూపిటిషన్ దాఖలు చేయడానికి అంగీకరించలేదనీ, తాను గతంలో పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్కే పరిమితం కావాలని భావిస్తున్నారంటూ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో జాదవ్కి 2017లో పాక్ మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. జాదవ్ని కలిసేందుకు మరోమారు అవకాశం ఇస్తున్నట్టు పాకిస్తాన్ మీడియా రిపోర్టు చేసింది. కుల్భూషణ్ కేసులో ఐసీజే తీర్పుని పాటిస్తున్నామని మేలో పాకిస్తాన్ వెల్లడించింది.
పచ్చి మోసం: భారత్
జాదవ్ తన మరణశిక్షపై అప్పీల్కు వెళ్ళేందుకు నిరాకరించారన్న పాక్ వాదన పచ్చి మోసమని భారత్ పేర్కొంది. రివ్యూపిటిషన్ వేయకుండా ఉండేందుకు, తనకున్న చిట్టచివ్వరి న్యాయపరమైన అవకాశాన్ని వాడుకోనివ్వకుండా జాదవ్పై పాకిస్తాన్ ఒత్తిడి చేసిందని స్పష్టమౌతోందని, ఇది నిర్లజ్జాకరమైన చర్య అని భారత విదేశాంగ శాఖ మండిపడింది.
జూలై 2020 సైన్స్ & టెక్నాలజీ
ఆగస్టు 15 నాటికి కరోనా టీకా: ఐసీఎంఆర్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్ను 2020, ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి ఐసీఎంఆర్ పనిచేస్తుంది. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది.
దేశంలోని 12 ప్రాంతాల్లో...
కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్లోని నిమ్స్ ఉన్నాయి. భారత్లో దేశీయంగానే తయారు చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదేనని ఐసీఎంఆర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ లేఖలో పేర్కొన్నారు.
ఏఐబీఏ-ఐబా ర్యాంకింగ్సలో అమిత్కు అగ్రస్థానం
ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ చరిత్రలో రజత పతకం నెగ్గిన ఏకై క భారత బాక్సర్గా గుర్తింపు పొందిన అమిత్ పంఘాల్ మరో ఘనత సాధించాడు. జూలై 6న విడుదల చేసిన అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా) ప్రపంచ ర్యాంకింగ్సలో అమిత్ పురుషుల 52 కేజీల విభాగంలో నంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. జకార్తా-2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా బాక్సర్ ఖాతాలో 1300 పాయింట్లు ఉన్నాయి. అమిత్ చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ జైరోవ్ షకోబిదిన్ (ఉజ్బెకిస్తాన్) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్కు పడిపోగా... అసెనోవ్ పనేవ్ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్లో ఉన్నాడు.
ఏఐబీఏ-ఐబా ర్యాకింగ్స్లో మొత్తం తొమ్మిది వెయిట్ కేటగిరీలకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు టాప్-10లో ఉన్నారు. దీపక్ (49 కేజీలు) ఆరో ర్యాంక్లో, కవీందర్ బిష్త్ (56 కేజీలు) నాలుగో ర్యాంక్లో, మనీశ్ కౌశిక్ (64 కేజీలు) ఆరో ర్యాంక్లో నిలిచారు. 2019 ఏడాది జనవరిలో ఐబా ప్రకటించిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్సలో టాప్ ర్యాంక్లో ఉన్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) తాజా ర్యాంకింగ్సలో మూడో స్థానానికి పడిపోయింది. ఇదే విభాగంలో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 21వ ర్యాంక్లో నిలిచింది.
టాప్ బ్యాట్స్మన్ ఎవర్టన్ వీక్స్ కన్నుమూత
వెస్టిండీస్ నాటితరం టాప్ బ్యాట్స్మన్ ఎవర్టన్ డి కార్సీ వీక్స్(95) జూలై 1న కన్నుమూశారు. 1948నుంచి 1958 మధ్య కాలంలో వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించిన వీక్స్ 15 సెంచరీలు, 19 అర్ధ సెంచరీలు సహా 4455 పరుగులు చేశారు. ఆయన టెస్టు బ్యాటింగ్ సగటు (58.61) ఆల్టైమ్ జాబితాలో టాప్-10లో ఉండటం విశేషం. అత్యంత వేగంగా 12 ఇన్నింగ్సలలోనే 1000 పరుగులు సాధించిన వీక్స్ దశాబ్దకాలం పాటు క్రికెట్ ప్రపంచంపై తనదైన ముద్ర వేశారు.
33 ఏళ్ల వయసుకే...
23 ఏళ్ల వయసులో తొలి టెస్టు ఆడిన వీక్స్... తొడ గాయం కారణంగా 33 ఏళ్ల వయసుకే ఆటకు గుడ్బై చెప్పాల్సి వచ్చింది. 1951లో విజ్డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిన ఆయనకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా చోటు దక్కింది. క్రికెట్కు వీక్స్ చేసిన సేవలకు 1995లో నైట్హుడ్ పురస్కారం దక్కడంతో ఆయన పేరు పక్కన సర్ చేరింది. రిటైర్మెంట్ తర్వాత ఐసీసీ మ్యాచ్ రిఫరీగా, కోచ్గా కూడా వీక్స్ పని చేశారు. ఆయన కుమారుడు డేవిడ్ ముర్రే విండీస్ తరఫున 10 టెస్టులు, 10 వన్డేలు ఆడాడు.
3 డబ్ల్యూస్లో ఒకరిగా...
సర్ క్లయిడ్ వాల్కాట్, సర్ ఫ్రాంక్ వారెల్, సర్ ఎవర్టన్ వీక్స్ కలిసి వెస్టిండీస్ విఖ్యాత బ్యాటింగ్ త్రయం 3 డబ్ల్యూస్గా గుర్తింపు పొందారు. భీకర పేస్కు తోడు ఈ ముగ్గురి బ్యాటింగ్ జట్టుకు గొప్ప విజయాలు అందించింది. బార్బడోస్లోనే 18 నెలల వ్యవధిలో పుట్టిన ఈ ముగ్గురు మూడు వారాల వ్యవధిలోనే విండీస్ తరఫున అరంగేట్రం చేశారు. ల్యుకేమియాతో ఫ్రాంక్వారెల్ 1967లోనే చనిపోగా, వాల్కాట్ 2006లో మరణించారు. వీరిలో ఇద్దరు బతికుండగానే బ్రిడ్జటౌన్లో ఈ ముగ్గురి పేరిట ఆంగ్ల అక్షరం గి రూపంలో స్మారకం ఏర్పాటు చేశారు. మిగతా ఇద్దరి సమాధులు ఉన్న చోటనే వీక్స్ను కూడా ఖననం చేయనున్నారు.
భారత ఒలింపిక్ సంఘం కొత్త లోగోలకు ఆమోదం
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రూపురేఖల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. దృశ్యపరంగా, బ్రాండింగ్ పరంగా తమ సంఘానికి కొత్త లుక్ ఇవ్వాలని ఐఓఏ నిర్ణయించింది. భారత అథ్లెట్లు ఒలింపిక్స్లో పాల్గొని 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ తరహా ఆలోచనలతో ముందుకు వచ్చింది. కొత్త లోగోలకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 15న వీటిని ఘనంగా ఆవిష్కరిస్తారు.
మాస్క్లు, శానిటైజర్లు నిత్యావసరాలు కాదు
నిత్యావసర వస్తువుల చట్టం 1955 పరిధిలో నుంచి ఫేస్ మాస్క్లు, శానిటైజర్లను కేంద్రం ప్రభుత్వం తొలగించింది. తగినంత సరఫరా పరిస్థితులు నెలకొన్నందునే వీటిని ఈ చట్టం పరిధి నుంచి తొలగిస్తున్నట్లు వినియోగ వ్యవహారాల శాఖ సెక్రటరీ లీనా నందన్ తెలిపారు. 2020. మార్చి 13న మాస్క్లు, శానిటైజర్లను కేంద్రం నిత్యావసర చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. తొలుత జూన్ 30 వరకు నిత్యావసర జాబితాలో ఉన్నట్టు కేంద్రం పేర్కొనగా.. తగినంత సరఫరా ఉండడంతో కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని లీనానందన్ స్పష్టం చేశారు.
యూటీఆర్ ప్రొ టెన్నిస్ టోర్నీ విజేతగా ప్రాంజల
ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూటీఆర్ ప్రొ టెన్నిస్ సిరీస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా నిలిచింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో 21 ఏళ్ల ప్రాంజల 6-3, 6-3తో డబుల్స్లో ప్రపంచ 37వ ర్యాంకర్ డెసిరే క్రాజిక్ (అమెరికా)పై నెగ్గింది.
రెండు అంతర్జాతీయ టోర్నీలు రద్దు
కరోనా ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో మరో రెండు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దయ్యాయి. 2020, ఆగస్టులో జరగాల్సిన చైనా మాస్టర్స్ సూపర్-100తోపాటు అక్టోబర్లో జరగాల్సిన డచ్ ఓపెన్ సూపర్-100 బ్యాడ్మింటన్ టోర్నలను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) జూలై 7న ప్రకటించింది.
ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రద్దు
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు వాయిదా పడిన ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టోర్నమెంట్ రద్దయ్యింది. కోవిడ్-19 కారణంగా ఈ ఈవెంట్ను రద్దు చేస్తున్నట్లు భారత గోల్ఫ్ యూనియన్ (ఐజీయూ) చైర్మన్ దేవాంగ్ షా జూలై 3న ప్రకటించారు. యూరోపియన్ గోల్ఫ్ టూర్లో భాగంగా జరిగే ఈ టోర్నీ... వాస్తవానికి 2020, మార్చి 19 నుంచి 23 వరకు గురుగ్రామ్లో జరగాల్సింది. కరోనా వైరస్ నేపథ్యంలో అప్పట్లో ఈ టోర్నీని వాయిదా వేశారు. 2020, అక్టోబర్లో నిర్వహించాలని తొలుత భావించినా... దేశంలో వైరస్ రోజురోజుకూ విజృంభిస్తుండటంతో టోర్నీ రద్దుకే మొగ్గు చూపామని షా తెలిపారు.
నలుపు రంగు కార్లతో ఎఫ్1 రేస్
జాత్యహంకారానికి వ్యతిరేకంగా నల్లజాతీయులకు అండగా నలుపు రంగు కార్లతో ఫార్ములావన్ సర్క్యూట్లో పాల్గొనాలని మెర్సిడెజ్ నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా జూలై 3న జరిగిన ఆస్ట్రియా గ్రాండ్ప్రి ప్రాక్టీస్ సెషన్లో మెర్సిడెజ్ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్ నలుపు రంగు కార్లతో ట్రాక్పై దూసుకెళ్లారు. సహజంగా మెర్సిడెజ్ సిల్వర్ కలర్ కార్లతో బరిలోకి దిగేది.
ఎఫ్1లో అలోన్సో పునరాగమనం
ప్రఖ్యాత ఫార్ములావన్ (ఎఫ్1) డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో ఫునరాగమనం ఖాయమైంది. వచ్చే సీజన్లో అతను రెనౌ జట్టు తరఫున మళ్లీ బరిలో దిగనున్నాడు. డేనియల్ రికియార్డో స్థానాన్ని అలోన్సో భర్తీ చేయనున్నట్లు రెనౌ యాజమాన్యం ప్రకటించింది. 2018లో ఫార్ములావన్ నుంచి తప్పుకున్న 38 ఏళ్ల అలోన్సో చివరిరేసులో మెక్లారెన్కు ప్రాతినిధ్యం వహించాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 32 రేసుల్ని నెగ్గిన అలోన్సో... గతంలో రెనౌకు ప్రాతినిధ్యం వహిస్తూ రెండు వరల్డ్ టైటిళ్లు (2005, 2006) తన ఖాతాలో వేసుకున్నాడు.
జూలై 2020 వ్యక్తులు
మొండి బాకీలపై ఉర్జిత్ పటేల్ పుస్తకం
బ్యాంకింగ్ మొండి బాకీల సమస్యపై రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాసిన పుస్తకం ఓవర్డ్రాఫ్ట్- భారత్లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం త్వరలో విడుదల కానుంది. ఈ విషయాన్ని పుస్తకాన్ని ప్రచురించిన హార్పర్కోలిన్స్ ఇండియా ఈ విషయం వెల్లడించింది. ఎన్పీఏలు పేరుకుపోవడానికి కారణాలు, పరిస్థితి చక్కదిద్దడానికి ఆర్బీఐ గవర్నర్ హోదాలో పటేల్ చేసిన ప్రయత్నాలు తదితర అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.
ఐఎఫ్ఎస్సీఏ చైర్మన్గా ఇంజేటి శ్రీనివాస్
ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంజేటి శ్రీనివాస్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి మూడేళ్ల వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది. తెలుగు వ్యక్తి అయిన శ్రీనివాస్, కేంద్రంలో కార్పొరేట్ శాఖా సెక్రటరీగా 2020, మే 31న పదవీ విరమణ పొందారు. ఐఎఫ్ఎస్సీఏ గాంధీనగర్ కేంద్రంగా 2020, ఏప్రిల్ 27న ఏర్పాటైంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్లో జరిగే అన్ని లావాదేవీలను ఇది పర్యవేక్షిస్తుంటుంది.
ప్రజాకవి, గాయకుడు నిస్సార్ కన్నుమూత
ప్రజాకవి, రచయిత, గాయకుడు, తెలంగాణ ప్రజానాట్యమండలి సహాయ కార్యదర్శి మహ్మద్ నిస్సార్ను (58) కరోనా కాటేసింది. ఈ మహమ్మారి సోకడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. జూలై 8న కన్నుమూశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు పడిన కష్టాలను బాధలను పేర్కొంటూముదనష్టపు కాలం.. ఇంకెంతకాలంఅంటూ ఇటీవలే ఓ పాట పాడారు. అదే ఆయన చివరి పాట.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తన ఆటపాటలతో లక్షలాది మందిని ఉద్యమ పథంలోకి నడిపిన నిస్సార్ది యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామం. మహ్మద్ అబ్బాస్, హలీమా దంపతులకు 1962 డిసెంబర్ 16న ఆయన జన్మించారు. సీపీఐ కార్యకర్తగా, తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుడిగా తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన పదునైన కంచుకంఠంతో పాడిన పాటలు గొప్ప చైతన్యాన్ని కలిగించాయి. పలు కవితలు కూడా రాశారు. దోపిడీ, పీడనలు, అణచివేతకు వ్యతిరేకంగా గళమెత్తారు.